Tuesday, May 14, 2024

చెన్నై- బెంగుళూరు డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ లో పొగలు

కుప్పం, జులై 13(ప్రభ న్యూస్) : చెన్నై నుండి బెంగళూరు వెళ్లే డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఉన్నట్టుండి ఎస్ 6బోగిలో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. చెన్నయ్ నుండి బెంగళూరు వెళ్లే డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు వయా కుప్పం గుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. గురువారం కుప్పం సమీపంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం దగ్గర రైలు నడుస్తుండగానే ఎస్ 6 బోగిలో పొగలు రావడం గుర్తించారు.

సమీపంలో ఉన్న జోలార్ పేట రైల్వే జంక్షన్ వద్ద అధికారులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారించుకుంటున్న తరువాత రైలు బయలుదేరింది. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ఆపద, ఇబ్బంది లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement