Friday, May 3, 2024

గౌతంరెడ్డి హఠాన్మరణం తీరని లోటు: మంత్రి తానేటి

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేని విషయమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి గౌతమ్ రెడ్డి క్యాబినెట్ లో చాలా చురుకుగా ఉండి అందరితో కలగలుపుగా మాట్లాడేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని, ఏ పనిలో నైనా వెంటనే స్పందించి ప్రజలకు సేవలందించే వారని కొనియాడారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం రాష్ట్ర ప్రజలకు, ఆ జిల్లా ప్రజలకు తీరనిలోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement