Thursday, May 2, 2024

బీజేపీకి షాక్.. మందమర్రి లీడర్లు రాజీనామా.. తెలంగాణపై మోడీ వ్యాఖ్యలే కారణం..

మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు సోమవారం రాజీనామా చేశారు. తనతో పాటు బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షుడు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షుడు బండి రవి, చెల్లేటి తిరుపతయ్య కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

తెలంగాణపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలచివేశాయని, సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేసిన కేంద్రం పట్టించుకోకపోవడంతో అట్లాంటి పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement