Friday, May 17, 2024

పర్యాటక కేంద్రంగా గడికోట అభివృద్ధి : మంత్రులు

మహేశ్వరంలోని ప్రసిద్ధిగాంచిన గడికోటను పురావస్తు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన గడి కోటను రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు సందర్శించారు.

చారిత్రాత్మక వారసత్వ సంపదను భావి తరాలకు అందించటంలో భాగంగా నాటి చిహ్నాలను, కట్టడాలను కాపాడుతూ, మరిన్ని నూతన హంగులు, మెరుగులు దిద్ది అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. పచ్చదనంతో పాటు పలు రకాల పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవటానికి కృషి చేస్తామన్నారు. గడికోట అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు ఆదేశించారు. మంత్రులతో పాటు జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, వివిధ శాఖ‌ల‌ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement