Sunday, April 28, 2024

సీపీఎస్‌పై త్వరలో స్పష్టత.. సీఎంవో ముట్టడి భావ్యం కాదన్న బొత్స

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు విజయవాడలో తలపెట్టిన ఛలో సీఎంవో కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీపీఎస్‌ అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వ కమిటీ వేసిందని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత జరిగే కమిటీ భేటీలో సీపీఎస్‌పై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లడం భావ్యం కాదన్నారు. అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement