Thursday, May 23, 2024

హెచ్‌పీసీఎల్‌ ఘటనపై విచారణ: మంత్రి అవంతి

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే మంత్రి అవంతి శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సంఘటన జరిగిన 45 నిమిషాల్లో నే మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. హెచ్‌పీసీఎల్‌లో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేదానిపై ఒక ఇంటర్నల్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి నివేదిక త్వరగా ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement