Friday, May 17, 2024

వేదాళం రీమేక్ లో దివి…క్లారిటీ వచ్చేసింది..!!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో కూడా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. అందులో వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో బిగ్ బాస్ ఫోర్ బ్యూటీ నటించబోతుంది. శ్రీ హాసన్ దివి జంటగా నటించిన క్యాబ్ స్టోరీ ఈనెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన దివి తాను చిరంజీవితో వేదాళం రీమేక్ లో ఓ పాత్రలో నటించనున్నట్లు తెలిపింది. ఇటీవల మెహర్ రమేష్ కథ చెప్పారని చాలా బాగుందని చెప్పుకొచ్చారు దివి.

Advertisement

తాజా వార్తలు

Advertisement