Monday, May 20, 2024

రేపు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ

ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు జరగనుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన సమావేశాలకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తాము కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని చెబుతున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగుల పీఆర్సీ వంటి అంశాలు చర్చకు వస్తున్న సందర్భంలో పార్టీ తరపున వాయిస్ వినిపించాలని చంద్రబాబు కోరుతున్నారు. అనేక జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement