Wednesday, May 22, 2024

రెండు బైక్‌లు పరస్పరం ఢీ.. ఇద్దరు దుర్మరణం

నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం తోగార్రాయి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఎదురెదురుగా రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు కోదాడ పట్టణం తమ్మరబండ పాలెంకు చెందిన అంజద్(20), బొమ్మకంటి అరవింద్(22)గా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement