Tuesday, May 14, 2024

4వ రోజు చేరిన పీపుల్స్ మార్చ్.. 14 కి.మీ కొనసాగనున్న భట్టి పాదయాత్ర

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్ర నాలుగవ రోజు చేరింది. బుధవారం ముదిగొండ మండలంలో భట్టి పాదయాత్ర ప్రారంభమైంది.

ఖానాపూర్ నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర పండ్రేగుపల్లి, కోదండరామ పురం ముత్తారం, కిష్టాపురం మీదుగా మల్లన్నపాడుకు చేరుకుంటుంది. 14.5 కిలోమీటర్లు కొనసాగనున్న పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఖానాపూర్ వద్ద రైతులు , నిరుద్యోగులు, మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బట్టి విక్రమార్క కు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. భట్టి విక్రమార్క వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల్ల దుర్గాప్రసాద్, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement