Thursday, May 2, 2024

కేశినేని చిన్ని ఉచిత మెగా మెడికల్ క్యాంపు.. స‌ద్వినియోగం చేసుకున్న స్థానికులు

విజయవాడ ప్రభ న్యూస్ – జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండే కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కృష్ణలంక ఐస్ ఫాక్టరీ వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేసినేని ఫౌండేషన్ అధినేత కేసినేని శివనాద్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి మెగా మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు.టిడిపి నాయకులు కేశినేని చిన్ని మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది యన్టీఆర్ ఆశయం అన్నారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో యన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎపుడు ముందుంటుందన్నారు.

యన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం అని గుర్తు చేశారు.ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు. కేవలం వైద్యపరీక్షలు చేయడం మాత్రమే కాదు…వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు చేసి,అవసరమైనవారికి వైద్యం సైతం అందిస్తాం అన్నారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీలకతీతంగా కొనసాగుతాయిన్నారు.

రానున్న రోజుల్లో టిడిపి అధికారంలోకి రావడం… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం తధ్యం. అని దేమా వ్యక్తం చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది వేల సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు అలాగే అవసరమైన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి వచ్చే ఆరోగ్య అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement