Wednesday, May 1, 2024

దారుణం: కూతురిని ప్రేమించాడని యువకుడిని నరికేసిన తండ్రి

చిత్తూరు జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించాడనే నెపంతో యువకుడిని యువతి తండ్రి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన పలమనేరు మండలం పెంగరగుంటలోచోటు చేసుకుంది. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

పెంగరగుంట గ్రామానికి చెందిన యువకుడు ధనశేఖర్, శైలజలు రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. పెళ్లి కూడ చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై ధనశేఖర్ ను మాట్లాడాలని శైలజ తండ్రి పిలిపించాడు. తన పొలానికి పిలిపించి ధనశేఖర్ ను హత్య చేశాడు.  ధనశేఖర్  మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.

నాలుగు రోజులుగా ధనశేఖర్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనశేఖర్ ఫోన్ కు చివరిసారిగా శైలజ తండ్రికి ఫోన్ లో మాట్లాడినట్లు నిర్ధారించారు. ఈ ఫోన్  సమాచారం ఆధారంగా  పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనశేఖర్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా మాట వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాబు అంగీకరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement