Sunday, April 28, 2024

ఆఫర్స్ వస్తున్నా…అఖిల్ నో చెప్తున్నాడట !!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు అక్కినేని అఖిల్. కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు గడుస్తున్నా సరైన హిట్ ని మాత్రం అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అఖిల్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. కానీ ఈ మహమ్మారి కారణంగా చాలా వరకు సినిమాలు ఓ టి టి లో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మాత్రం ఈ సినిమాను ఓ టి టి లో రిలీజ్ చేయడం లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ సినిమాకి మాత్రం నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. కానీ దర్శక నిర్మాతలు మాత్రం నో చెబుతున్నారట. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement