Friday, April 26, 2024

ఓటుకు నోటు కేసు: తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ అభ్యర్థన మేరకు కేసు విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు ఓటుకు నోటు కేసులో నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్య జెరూసలేం, వేం నరేందర్‌రెడ్డి తనయుడు వేం కృష్ణకీర్తన్‌పై అభియోగాలు నమోదు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ పట్టుబడిన రూ.50 లక్షలను జప్తు చేసినట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement