Tuesday, April 30, 2024

Singanamala: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

యల్లనూరు, జులై 11 (ప్రభ న్యూస్) : సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతిచెందిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా… స్థానిక మండల కేంద్రానికి చెందిన బొరుగుల బట్టిలో కటిక మునీశ్వర్ (38) దినచర్యలో భాగంగా బొరుగులు వేంచుటకు వెళ్ళాడు. బట్టిలో పొట్టు తోడుతుండగా ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు కాళ్లకు తగులుకొన్నాయి. పూర్తి గాయాలయిన కటిక మునిశ్వర్ ను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement