Thursday, May 16, 2024

KNL: తుంగతీరాన రమణీయంగా ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి మహాత్సవం

కోసిగి, సెప్టెంబర్11 (ప్రభ న్యూస్) : శ్రీ ఉరుకుంద ఈరన్న(నరసింహ)స్వామి సన్నిధిలో పవిత్ర శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఉరుకుంద క్షేత్రం నుండి కందుకూరు వరకు స్వామివారి ఉత్సవమూర్తిని రమణీయంగా సాగిన మహాపల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, తుంగభద్ర నదిజలాలతో శాస్త్రోక్తంగా పుణ్యస్నానంను జరిపించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు గ్రామం తుంగభద్ర నది తీరాన ఈ పల్లకి మహాత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రదీప్ రెడ్డికి ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షులు నాగరాజు గౌడ్, ఆలయ అర్చకులు వీరప్ప స్వామి, మండల కన్వీనర్ బెట్టనగౌడ్ స్వాగతం పలికారు. మహాపల్లకిలో ఉన్న ఉరుకుంద ఈరన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో యంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజు, జగదీష్ స్వామి, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్, కాల్వ లక్ష్మయ్య, వీరస్వామి, కందుకూరు తాయన్న, యంపీటీసీ మల్లయ్య, మాజీ యంపీటీసి రమేష్, పి.వెంకటేష్, పెద్ద బొంపల్లిఅంజి, దేవస్థానం బోర్డు సభ్యులు మల్లికార్జున గౌడ్, వీజేంద్ర రెడ్డి, బుళ్ళి నరసింహులు, వై.నర్సమ్మ, లక్ష్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement