Thursday, May 2, 2024

KNL: జైలుకు చంద్రబాబు… గుండెపోటుతో మరో అభిమాని మృతి

కర్నూలు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఓ కార్యకర్త తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం ఎస్ ఎర్రగుడి గ్రామానికి చెందిన పి.సుభాన్ అనే తెలుగుదేశం కార్యకర్త గుండెపోటుకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు.

నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో తీవ్ర మనస్తపానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు నిన్న కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. సుభాన్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మృతుడు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రబాబు అరెస్టుతో సుభాన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్దదిక్కును కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement