Monday, April 29, 2024

AP: బ‌స్సును ఢీకొట్టిన లారీ..డ్రైవ‌ర్ మృతి..13మందికి గాయాలు

ఏపీలోని అనంత‌పూర్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉద‌యం వెల్దుర్తి మండలం ఉల్లడికొండ సమీపంలో జాతీయ ర‌హ‌దారిపై వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సును ఎదురుగా వ‌స్తున్న‌ లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు డ్రైవ‌ర్ అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా 13మందికి గాయాల‌య్యాయి.

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement