Saturday, May 4, 2024

Tamilsai: రాజ్‌భవ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు.. పాయసం వండిన గ‌వ‌ర్న‌ర్‌…

రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదుచ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement