Friday, April 26, 2024

TDP: పాద‌యాత్ర‌కు ప్లాన్​ చేస్తున్న లోకేశ్​.. 450 రోజుల షెడ్యూల్‌తో రూట్‌మ్యాప్!

తెలుగుదేశం పార్టీ లీడ‌ర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్‌గా ప‌నిచేయ‌నున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేశ్ యాత్ర సాగనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్న‌ట్టు స‌మాచారం.

నిజానికి ఈ అక్టోబరు నుంచే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తర్వాత చేపడితే బాగుంటుందన్న కారణంతో వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇక‌.. సంక్రాంతి పండుగ తర్వాత ఈ యాత్ర ప్రారంభిస్తార‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి.

కాగా, లోకేశ్ పాద‌యాత్ర మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే టైమ్‌కు ముగిసేలా రూట్‌మ్యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించిన‌ట్టు స‌మాచారం. అన్ని ప్రాంతాలను క‌వ‌ర్ చేసేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా, గ్యాప్ లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేశ్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇక‌.. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేపట్టి విజయం సాధించారు. ఇప్పుడు ఈ ఫార్ములానే లోకేశ్ కూడా కొన‌సాగించాల‌ని ట్రై చేస్తున్న‌ట్టు అవ‌గ‌తం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ పాదయాత్ర చేసిన‌ చివరి లీడ‌ర్‌గా చంద్రబాబు రికార్డులకెక్కారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్ కూడా పాదయాత్ర చేపట్టినప్పటికీ రాష్ట్రం విడిపోవడంతో ఆయన యాత్ర ఏపీకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు విడిపోయిన ఏపీలో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా లోకేశ్ రికార్డులకెక్కనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement