Monday, April 29, 2024

Breaking | మ‌రికొద్దిసేప‌ట్లో సీఐడీ విచార‌ణ‌కు లోకేశ్‌.. ఏపీ టీడీపీలో ఆందోళ‌న‌!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఇవ్వాల (మంగ‌ళ‌వారం) సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. త‌మ‌కు కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఉద్దేశపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది.

ఇక‌.. ఈ కేసులో లోకేశ్ ఏ14 నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద లోకేశ్ కు సీఐడీ ఈ మ‌ధ్య‌నే నోటీసులు ఇచ్చింది. కాగా, లోకేశ్ ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ సమయంలో లోకేశ్ తో పాటు ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు, ఈ విచారణ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement