Thursday, May 2, 2024

తిరుమలలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా


రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరుమలకు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రేణి గుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల కొండపైకి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఓం బిర్లా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేద పాఠశాల సందర్శనతో పాటు, అధికారులతోనూ సమీక్ష చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement