Friday, May 24, 2024

ఏపీలో నేడు, రేపు మద్యం విక్రయాల సమయం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాల సమయం పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో మద్యం దుకాణాల్లో రాత్రి 12 గంటల వరకు అమ్మకాలు కొనసాగనున్నాయి. అదేవిధంగా బార్లు, హోటళ్లు, ఈవెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. అయితే ఇవాళ, రేపు మాత్రమే మద్యం విక్రయాల వేళల పొడిగింపు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అమ్మకాల సమయం పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement