Sunday, May 19, 2024

ఎంపి రామిరెడ్డిని క‌లిసిన‌ మద్య విమోచన కమిటీ చైర్మన్

అమరావతి, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని శుక్రవారం పెదకాకానిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, శర్వాణి రెడీ మిక్స్ అధినేత పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచిన మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర స్థాయిలో మద్యం దుష్ఫలితాలపై ప్రజలను జాగృతలను చేయడానికి విశిష్ట కృషి చేస్తుందని తెలుపుతూ చైర్మన్ లక్ష్మణరెడ్డికి అభినందనలు తెలిపారు. పెదకాకాని మండలంలో కళాజాత ద్వారా మత్తు పానీయాల పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. లక్ష్మణరెడ్డి తన స్వగ్రామమైన కారుమంచి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కారుమంచి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని లక్ష్మణరెడ్డికి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement