Friday, April 26, 2024

అమరావతి దొంగ రైతుల యాత్ర లాగే.. లోకేశ్ పాద‌యాత్ర‌… ఎంపీ భ‌ర‌త్

లోకేశ్ పాదయాత్ర… అమరావతి దొంగ రైతుల పాదయాత్రలానే ఉంటుందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై సీఎం జగన్ అన్ని విషయాలు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారన్నారు. పోలవరం ప్రాజెక్ట్, విభజన అంశాలతో పాటు స్టీల్ ప్లాంట్ పై ప్రధానితో మాట్లాడారని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ మహా యజ్ఞంలా చేస్తున్నారని వెల్లడించారు. ప్రత్యేక హోదా గురించి బీజేపీని పవన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement