Wednesday, April 24, 2024

సుప్రీంకోర్టులో ఫామ్ హౌజ్ కేసు విచారణ ఈనెల 21కి వాయిదా

తెలంగాణలో సంచలనంగా మారిన‌ ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. హైకోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వనున్నందున విచారణను వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. ఈ క్రమంలో స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21వ‌తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement