Tuesday, May 14, 2024

AP: నేతాజీ స్ఫూర్తితో అరాచ‌క శ‌క్తుల‌పై పోరాడ‌దాం… చంద్ర‌బాబు

స్వాతంత్ర సమరయోధులు భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ఈరోజు. నేతాజీ స్ఫూర్తితో ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న అరాచ‌క శ‌క్తుల‌పై పోరాడ‌దామ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరవీరులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ కి ఆయ‌న‌ నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన నారా చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే అని నేతాజీ అన్నారని పేర్కొన్నారు. కనుక మహానుభావుడైన ఆ నేతాజీ మాటలనే స్ఫూర్తిదాయకంగా తీసుకుని నేడు ప్రజలను పీడిస్తున్న అరాచక శక్తులపై పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నేతాజీ జయంతిని దేశం శౌర్యదినోత్సవంగా జరుపుకుంటుందని .. అలాంటి మోహోన్నతమైన ఈ రోజు ఆ దేశభక్తుని సేవలు స్మరించుకుందామని పేర్కొంటూ ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement