Friday, May 17, 2024

నగరాన్ని నందన‌వనం చేస్తాం : క‌ర్నూలు మేయర్

కర్నూలు నగరాన్ని అన్ని హంగులతో సరికొత్త నిర్మాణాలతో నందనవనం చేస్తామని మేయర్ బి.వై.రామయ్య అన్నారు. బుధవారం సి.క్యాంపు సెంటర్ సర్కిల్లో నగర పాలక సంస్థ నిర్మిస్తున్న “మిని కొండారెడ్డి బురుజు” ను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో అద్భుతమైన కట్టడాలు ఎన్నో జరుగుతున్నాయని, వాటన్నింటినీ త్వరలో పూర్తి చేసి నగరాన్ని నందనవనం చేస్తామన్నారు. నగర పాలక సంస్థ చేపట్టిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఈ రాజశేఖర్, ఏఈ హిమబిందు, పార్టీ నాయకులు కటారి సురేష్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement