Thursday, May 2, 2024

మోడీ హేట్స్ తెలంగాణ హ్యాష్ టాగ్ తో రేవంత్ ట్వీట్

మోదీ పార్లమెంట్ ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ హేట్స్ తెలంగాణ హ్యాష్ టాగ్ తో రేవంత్ ట్వీట్ చేశారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగం రెండు విషయాలను స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ తోనే జరిగిందని, టీఆర్ఎస్ పాత్ర లేదని చెప్పారు. తెలంగాణ పట్ల బీజేపీ ద్వేషభావాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం బీజేపీ చేసింది శూన్యం అని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మక్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి ఆక్షేపించారు. తెలంగాణ సమాజానికి మోడీ క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement