Tuesday, May 21, 2024

టిప్పర్, కారు ఢీ.. యువతి మృతి

ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లి గ్రామం మెట్ట వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన మనోజ్ఞ (28) మృతి చెందారు. హైదరాబాద్ నుండి తానే కారు డ్రైవ్ చేసుకుంటూ తిరుపతికి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కోసం వచ్చారు. తిరిగి హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో పేరాయపల్లి వద్ద ఆగి ఉన్న టిప్పర్ ను నిద్రమత్తులో ఢీ కొనడంతో ఆమె కారులోనే మరణించినట్లు రూరల్ సీఐ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement