Monday, May 6, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం ఖాయం : కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లా కోడుమూరులో మీడియాతో మాట్లాడుతూ. మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారని, అన్ని రంగాల్లో ఇబ్బంది ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, శ్రీలంక పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరందిస్తామన్నారు. ఫ్లెక్సీలపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో మంత్రులు కేవలం ప్రొటోకాల్ కోస‌మే వున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకే క్యాడర్ వుందని, వైసీపీకి క్యాడర్ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement