Friday, April 26, 2024

పాణ్యం గిరిజన గురుకుల వార్డెన్ సస్పెన్షన్

పాణ్యం గిరిజన గురుకుల వార్డెన్ పద్మావతి ని సస్పెండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ మునజీర్ జిలాని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల పాణ్యం మండలం నేరవాడమెట్ట గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురైన సంగతి విధితమే. ఈ ఘటనలో సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఐటిడిఏ, రెవెన్యూ అధికారులతో విచారణ నిర్వహించారు. వారి విచారణలో వార్డెన్ స్థానికంగా లేకపోవడం, విద్యార్థులు బయట చిరుతిళ్లు తినడం వంటి లోపాలను గుర్తించారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని గుర్తించిన కలెక్టర్ ఆమెను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement