Sunday, April 28, 2024

చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన సిఐ శ్రీనివాస‌రెడ్డి…

కర్నూలు – సుందరయ్య స్పూర్తి కేంద్రం ఆద్వర్యంలో కర్నూలు సుందరయ్య సర్కిల్ లో ఈరోజు 4వ పట్టణ పోలిస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి కూల్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సుందరయ్య స్పూర్తి కేంద్రం ట్రస్టు ఛైర్మన్ కె. ప్రభాకర రెడ్డి అద్యక్షతన వహించారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం సి. ఐ. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వేసవి చాలా తీవ్రంగా వున్న ఈ పరిస్థితులలో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయం అని అన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య స్పూర్తి కేంద్రం కార్యదర్శి గౌస్ దేశాయ్, కోశాధికారి రామాంజనేయులు మాజీ కార్పొరేటర్లు పి. నిర్మల, టి. రాముడు, ఇ.పుల్లారెడ్డి, అలివేలమ్మ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ప్రకాష్, అబ్దుల్లా, నాగేష్, రాఘవేంద్ర, కె. ఎస్ పద్మ, నోమేశ్వరి, కిరణ్మయి, సిఐటియు నాయకులు రాధాకృష్ణ, అంజిబాబు, రాజశేఖర్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement