Sunday, May 5, 2024

Flash: భక్తులపై తేనెటీగలు దాడి

శ్రీశైలం వెళ్తున్న భక్తులపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో చోటుచేసుకుంది. చెలిమిల్ల గ్రామ సమీపంలో కర్ణాటక నుండి శ్రీశైలం వెళ్తున్న భక్తులు ఎస్ఆర్ఎంసి కాలువలో స్నానం చేసేందుకు దిగారు. అయితే అక్కడే ఉన్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. భక్తులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో సుమారు 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు. గాయపడిన వారిని పాములపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement