Friday, May 17, 2024

Guntur: ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తల్లి ఆత్మహత్యాయత్నం

తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తల్లి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తెనాలి మండ‌లం అంగ‌ల‌కుదురులో విషాద ఘటన జరిగింది. వివాహిత గాలి నాగ‌ల‌క్ష్మి తన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పురుగుల మందు తాగించి తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు యత్నించింది. వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే తెనాలి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో ఇద్ద‌రు పిల్ల‌లు క్షేమంగా బయటపడ్డారు. కాగా… త‌ల్లి నాగ‌ల‌క్ష్మి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో గుంటూరుకు తరలించారు. మూడేళ్లుగా భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటూ అనారోగ్య కార‌ణాల‌తో ఈ దారుణానికి పాల్ప‌డినట్టు నాగ‌ల‌క్ష్మి సూసైడ్ లెటర్‌లో రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement