Tuesday, May 7, 2024

Nandyala: పొలంలో పనిచేస్తున్న వ్యక్తి కిడ్నాప్ నకు యత్నం

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల (మం) భీమునిపాడుకు చెందిన రాజేష్ అనే వ్యక్తిపై దాడి చేసి కిడ్నాప్ నకు యత్నించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం, భీమునిపాడు గ్రామంలో తనకున్న ఎకరం భూమిని చదును చేస్తుండగా గ్రామానికి చెందిన సహదేవరెడ్డి అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు రాజేష్ ను కిడ్నాప్ చేసే యత్నం చేశారు. రాజేష్ ను జీపులో ఎక్కించుకొని పిడిగుద్దులతో కొడుతుండగా జీపు దిగి వాళ్ళను తోసేసి తప్పించుకొని బాధితుడు రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి రాజేష్ కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement