Wednesday, May 15, 2024

క‌ర్నూలులో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.. నల్గొండ వాసిగా గుర్తింపు

కర్నూల్ క్రైమ్, ప్రభ న్యూస్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కర్నూల్ జిల్లాలో జ‌రిగింది. రైల్వే ఎస్ఐ డి. కిరణ్ బాబు వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. కర్నూల్ నగర పరిధిలోని బిర్లా కాంపౌండ్ సమీపంలో గుర్తుతెలియని వ్య‌క్తి రైలు కింద పడి ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య క్రమంలో తల, మొండెం వేరుగా పడింది. యువకుడి శవం వద్ద లభించిన వివరాల మేరకు మృతునిది నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, నోముల గ్రామంగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్టేషన్ సూపరింటెండెంట్ వి. హిమబిందు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement