Tuesday, May 14, 2024

కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షన్..కాపు కాసి అన్నదమ్ములను చంపిన ప్రత్యర్థులు

కర్నూలు జిల్లా గడివేముల మండలంపెసరవాయిలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మృతులను మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వరరెడ్డి, అతడి తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిగా గుర్తించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువు సమాధి వద్దకు వెళ్తుండగా నిందితులు వారిని బొలేరో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement