Thursday, May 2, 2024

సుకుమార్, దేవరకొండల ప్లాన్ అమలులోనే ఉందట !!

ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజుగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై ఆసక్తి నెలకొంది.

నిజానికి సుకుమార్ విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ, సుకుమార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement