Saturday, April 27, 2024

పిడుగుపాటుకు మహిళ మృతి

మచిలీపట్నం : పొలం ప‌నులు చేసుకుంటున్న క్ర‌మంలో పిడుగుపాటుకు మ‌హిళ‌ మృతి చెందిన సంఘటన మచిలీపట్నం, కాలే ఖాన్ పేటలో చోటు చేసుకుంది. పొలంలో మహిళలు కలుపు తీస్తుండగా పిడుగు ప‌డి మహిళ మృతి చెందగా, ఆమెతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పిడుగుపాటుకు గురైన బాధితులంతా బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ఆరుగురిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు సమాచారం. మృతురాలు కాలేఖాన్ పేటకు చెందిన అర్జా సీతారావమ్మ (35)గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement