Sunday, April 28, 2024

AP : ప్రజాసేవకు పునరంకితం అవుతా…సుజ‌నా చౌద‌రి

విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సుల తో భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే ముందు విజయవాడ చిట్టి నగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజనా ప్రత్యేక పూజల చేశారు.

- Advertisement -

ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు సంతోషంగా ఉందన్నారు. ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కళ్ళారా చూశానని అన్నారు. పశ్చిమ నియోజవర్గన్ని అభివృద్ధి పరచేందుకు రాజ్యాంగ బద్ధమైన నాయకుడు అవసరం ఉందని ఆ బాధ్యతను తాను తీసుకుంటానని సుజనా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement