Monday, April 29, 2024

Delhi : ఓటుకు నోటు కేసు… విచార‌ణ జులైకి వాయిదా

న్యూ ఢిల్లీ – సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఎస్వీ ఎన్ భట్టిల ధర్మాసనాన్ని కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది. అటు వేస‌వి సెలవుల తరువాత విచారణ జరపాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా అభ్య‌ర్ధించారు..

2015లో జరిగిన వ్యవహారం అని ఏళ్ళ తరబడి కేసు పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది. అన్ని వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కేసును జులై 24కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement