Thursday, May 16, 2024

AP | అక్టోబరు 1 నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర.. అవనిగడ్డలో బహిరంగ సభతో శ్రీకారం

అమరావతి, ఆంధ్రప్రభ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయ యాత్ర నాలుగో దశ కృష్ణా జిల్లా నుండి ప్రారంభం కానుంది. ఈమేరకు ఆపార్టీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్రను అవనిగడ్డ నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలో అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. యక్కటి దివాకర్‌ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. సభా నిర్వహణకు ఏర్పాట్లను జనసేన నాయకులు శుక్రవారం ప్రారంభించారు.

వారాహి వాహనంపై నుంచి సభికుల్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయ యాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజులపాటు కొనసాగనుంది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో పవన్‌ కళ్యాణ్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- Advertisement -

2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ కళ్యాణ్‌ పర్యటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement