Thursday, May 2, 2024

అధిక లోడుతో ప్రయాణించి ప్రమాదాలకు గురి కాకండి

ఎ. కొండూరు – ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు గురి చేయవద్దని ఆటో డ్రైవర్లకు ఎస్ఐ కె. ప్రతాపరెడ్డి సూచనలి చ్చారు. శుక్రవారం మండలంలోని ఎ. కొండూరు, కంభంపాడు చీమలపాడు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని, డ్రైవర్లు యూనిఫామ్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అధిక లోడుతో వెళ్తున్న ప్రయాణికుల ఆటోలను నిలిపి డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement