Tuesday, May 14, 2024

జ‌డ్పీ ఏక‌గ్రీవాల‌పై ఫిర్యాదులు చేసుకోండి – పరిశీలిస్తాం – నిమ్మ‌గ‌డ్డ‌…

విజయవాడ: తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తెలిపారు. విజ‌య‌వాడ‌లోని ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నాన‌ని తెలిపారు..కాగా, గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నాంటూ వారిని ప్ర‌శంసించారు..అలాగే ఎపిలోని పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్ర‌భుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement