Saturday, May 4, 2024

మంగినపూడి బీచ్ లో యువకుడు గల్లంతు.. ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు..

కృష్ణా జిల్లా : మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యువ‌కుడు గ‌ల్లంత‌య్యాడు. తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన పెడన ఎన్టీఆర్ కాలనీ చెందిన విట్టం శెట్టి జయకృష్ణ (15) గల్లంత‌య్యాడు. దాంతో అత‌ని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జ‌య‌కృష్ణ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు జాల‌ర్లు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement