Saturday, May 4, 2024

కిరాణా షాపుల పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడి

ఎ. కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో కిరాణా షాపుల పై శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడి జరిపారు. ఈ దాడిలో నాటుసారా కు ఉపయోగించే782 కేజీల బెల్లం, 51 కేజీల పటిక స్వాధీనపరుచుకున్న ట్లు ఇన్చార్జి సీఐ ఐఎన్ఎస్ బాలాజీ తెలిపారు. అలానే రేపూడి తండాలో సారా తయారీ కేంద్రాలపై దాడి జరిపి మూడు లీటర్ల నాటుసారాను స్వాధీనపరచుకొని ఆరు వందల లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసి, రెండు వాహనాలను సీజ్ చేసి, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ బాలాజీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement