షాద్నగర్ : కరోనా టీకాపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, కరోనా టీకాలు సురక్షితమని నిర్భయంగా వేసుకోవచ్చని షాద్నగర్ తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పేర్కోన్నారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ప్రతాప్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భయపడోద్దు ఆ భయాన్ని పోగోట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. టీకా పని చేస్తుందా లేని అనే అనుమానాలు వద్దన్నారు. కొందరికి టీకా వేసిన తర్వాత జ్వరం వస్తుందని గుర్తు చేశారు. దీనర్థం వ్యాక్సిన్ శరీరం ప్రతి స్పందిస్తుందని అంతేగాని సైడ్ ఎఫెక్ట్ కావని చెప్పారు. అందరు నిర్బయంగా విధిగా తీసుకోవాలని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement