Friday, April 26, 2024

కృష్ణా జిల్లాలో విషాదం.. ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గ‌న్న‌వ‌రం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య (50)గా గుర్తించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement