Tuesday, May 7, 2024

ఎన్టీఆర్ కి కరోనా నెగిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువైన నేపథ్యంలో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తనకి పాజిటివ్ నిర్ధారణ అయిందని ఎన్టీఆర్ గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో సినీ రాజకీయ ప్రముఖులు అందరు కూడా త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లు చేశారు.

అయితే తాజాగా తనకి నెగిటివ్ వచ్చిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే డాక్టర్లకు కృతజ్ఞతలు. కరోనా మహమ్మారి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఉండండి.. ఎవరు అధైర్య పడకండి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement